Movie News

విశాఖ ఉక్కు ఉద్యమానికి కరువైన టాలీవుడ్ మద్దతు..పెద్ద స్టార్ల జడ ఏది..?

ఏపీ లో విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ చేస్తామని, ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ లేదని నిర్మల సీతారామన్ తేల్చి చెప్పడంతో విశాఖ లో ఈ ఆందోళనలు ఎక్కువయాయ్యి. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ఈ ఆందోళనను ఉధృతం చేశారు. ధర్నాలు, దీక్షలు, మానవహారం, నిరసనలు చేపట్టి వారి సత్తా కేంద్రానికి తెలిసేలా ఆందోళన బాటలు పట్టారు.

ఈ తరుణంలో ఈ ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్ లోని పలు సంఘాలు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీ లు మద్దతు పలుకుతుండగా టాలీవుడ్ లో చలనం లేకపోవడం ఇప్పుడు వివాదం గా మారుతుంది. గతంలో కూడా ఇదే వైఖరి ప్రదర్శించిన టాలీవుడ్ స్టార్ లు ఇప్పుడు అదేవిధంగా పట్టించుకోకపోవడం గమనార్హం.. ఎప్పటిలాగే మనకెందుకు అన్నట్లు వేడుక చూస్తున్నారు. కొంతమంది సెలెబ్రిటీలు మాత్రం ఉద్యమానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టి ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.

నారా రోహిత్ ఇప్పటికే నిరసన గళం వినిపించారు.ఇంకా రైటర్ కోనా వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.కానీ టాలీవుడ్ పెద్దలు మాత్రం ఈ ఇష్యూపై నోరు విప్పలేదు. నారా రోహిత్ కొంచెం గట్టిగానే ట్వీట్ చేశాడు.. కోనవెంకట్, ఆర్ఫీ పట్నాయక్ లు కూడా కొంచెం ఘాటుగానే పోస్ట్ పెట్టి చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. మరి ఈ ఉద్యమానికి టాలీవుడ్ స్టార్ ల హస్తం కూడా తోడయితే విశాఖ ప్రజల హక్కును వారు కాపాడినవారవుతారు. మరి వారిలో చైతన్యం తెచ్చేది ఎవరో..

TD Admin

Recent Posts

అషు రెడ్డి కేసులో భారీ ట్విస్ట్.. రూ.10 కోట్ల మోసం ఆరోపణలు

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

28 minutes ago

కామన్వెల్త్‌లో తెలుగు అమ్మాయి జోరు.. గోల్డ్, సిల్వర్‌తో చరిత్ర!

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…

1 hour ago

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

10 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

10 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

10 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

10 hours ago