NTR : సినిమారంగంపై మక్కువతో చిత్రసీమలో అడుగు పెట్టిన వడ్డే రమేశ్ మొదట ‘సున్హేరా సంసార్’ అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పండంటి కాపురం ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శత్వంలో ఈ హిందీ చిత్రం రూపొందింది. తెలుగులో ఆయన నిర్మించిన తొలిచిత్రం పాడవోయి భారతీయుడా. తరువాత అక్కినేని హీరోగా ఆత్మీయుడు నిర్మించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా రమేశ్ నిర్మించిన ‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాల విజయంతో తన ప్రస్థానాన్ని అప్రహతిహతంగా కొనసాగించారు. తన కుమారుడు నవీన్ హీరోగా నటించిన “లవ్ స్టోరీ99” చిత్రానికి వడ్డే రమేశ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
“కలహాల కాపురం”, “తిరుగుబాటు”, “దుర్గాదేవి”, “ఏడుకొండల స్వామి” వంటి చిత్రాలనూ ఆయన నిర్మించారు. దాసరి నారాయణరావుతో రమేశ్ బంధం విడదీయలేనిది. దాసరి దర్శకత్వంలో ఎన్ని చిత్రాలు నిర్మించినా ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్మాతగా జనం మదిలో ముద్ర వేశారు.. అయితే ఈ బొబ్బిలిపులి చిత్ర నిర్మాణం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం.. అక్కినేని నాగేశ్వరరావుతో “ఆత్మీయుడు” చిత్రం తర్వాత వడ్డే రమేష్ ఎన్టీఆర్ తో కూడా ఒక చిత్రాన్ని తీయాలనుకున్నారు. ఆ క్రమంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావాలని సంకల్పించారు. ఇక సినిమాలకు దూరం కావలసి వస్తుందేమో అని ఒక చిత్రాన్ని తీసి రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వెళ్లిపోవాలనుకున్నారు.. సినీ ప్రముఖులు, అభిమానులతో ఎన్టీ రామారావు గృహం సందడితో నిండిపోయింది. అయితే వడ్డే రమేష్ సినిమా నిర్మించాలనడంతో ఎన్టీ రామారావు, దాసరికి ఫోన్ చేసి పిలిపించారు. సొంత కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను కాదనుకొని దేశం కోసం జీవితాన్ని అర్పించే జవాను కథతో సినిమా రూపొందించాలనుకున్నారు.
ఆ కథ కూడా ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఆనాటి సాంఘిక అంశాలను జోడిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు దాసరి కథను సిద్ధం చేశారు. 1981 ఆగస్టు1 నటి మంజుల ఇంట్లో అట్టహాసంగా బొబ్బిలిపులి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. 1982 ఏప్రిల్ 7న బొబ్బిలిపులి చిత్రం విడుదల కావాలి.. కానీ అప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటన జరిగి ఆంధ్రప్రదేశ్ లోని 294 స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఎన్టీ రామారావు నిమగ్నమయ్యారు. 1982 మార్చి 31న సినిమా విడుదల కోసం వడ్డే రమేష్ చెన్నై సెన్సార్ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నారు. తను నటిస్తున్న 294వ చిత్రం బొబ్బిలిపులి అనేక సెన్సార్ అవరోధాలను ఎదుర్కొని చిట్టచివరికి ఎట్టకేలకు 1982 జులై 9న విడుదలై… బొబ్బిలిపులి చిత్రంలోని సన్నివేశాలు నాటి జీవన విధానాలను ప్రభావితం చేసేలా ఉండడంతో ఆ సినిమా ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపింది. ఆ విజయం ఎన్టీ రామారావును 9 నెలలు తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…