Featured

NTR : తెలుగులో మొదటి త్రిపాత్రాభినయ చిత్రంలో నటించిన హీరో ఎవరు.?! ఆ రోజుల్లో ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.!!

నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు.తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. దాన వీర శూర కర్ణ సినిమా నిర్మాణ విషయానికి వస్తే…

1977లో ఎన్టీఆర్, స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో “దానవీరశూరకర్ణ” చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం దానవీరశూరకర్ణ చిత్రం. ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో ఆయన నటించారనేకంటే జీవించాడని చెప్పవచ్చు. సభలో “ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. ఇది క్షాత్ర పరిక్షే కాని క్షత్రియ పరిక్ష కాదే.. కాదు,కాకూడదు” అనే సంభాషణను నేటికి ప్రేక్షకులు అనుసరించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్టీ.రామారావు కృషి, శ్రమ ఫలితంగా చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్ మహాభారతం లోని కొంత భాగాన్ని తీసుకుని ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ సినిమాకి సంభాషణల రచయితగా గుంటూరులోని ఓ సంస్కృత శకళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కొండవీటి వెంకట కవిని తీసుకున్నారు. అయితే ఈ కవికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. కానీ ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడిగా హరికృష్ణ, భీముడిగా సత్యనారాయణ, అభిమన్యుడిగా బాలకృష్ణ.. ఇకపోతే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్.టి.రామారావు కనిపించిన ఈ భారీ చిత్రాన్ని కేవలం నలభై మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.

ఈ సినిమా నిడివి దాదాపు 4 గం.ల17 నిమిషాలు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఏదో ఒక పాత్రలో సుమారుగా నాలుగు గంటలపాటు కనిపిస్తారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. కొండవీటి వెంకటకవి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి వంటి వారు ఈ సినిమాకి గీతాలను అందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమాల కోసం ఆస్తులు అమ్మేసిన నటుడు..కళ్ళు చిదంబరం జీవితం వెనుక నిజాలు

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…

29 minutes ago

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

11 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

11 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

11 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

11 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

11 hours ago