Featured

NTR : తెలుగులో మొదటి త్రిపాత్రాభినయ చిత్రంలో నటించిన హీరో ఎవరు.?! ఆ రోజుల్లో ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.!!

నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు.తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. దాన వీర శూర కర్ణ సినిమా నిర్మాణ విషయానికి వస్తే…

1977లో ఎన్టీఆర్, స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో “దానవీరశూరకర్ణ” చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం దానవీరశూరకర్ణ చిత్రం. ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో ఆయన నటించారనేకంటే జీవించాడని చెప్పవచ్చు. సభలో “ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. ఇది క్షాత్ర పరిక్షే కాని క్షత్రియ పరిక్ష కాదే.. కాదు,కాకూడదు” అనే సంభాషణను నేటికి ప్రేక్షకులు అనుసరించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్టీ.రామారావు కృషి, శ్రమ ఫలితంగా చెప్పుకోవచ్చు.

ఎన్టీఆర్ మహాభారతం లోని కొంత భాగాన్ని తీసుకుని ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ సినిమాకి సంభాషణల రచయితగా గుంటూరులోని ఓ సంస్కృత శకళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కొండవీటి వెంకట కవిని తీసుకున్నారు. అయితే ఈ కవికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. కానీ ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడిగా హరికృష్ణ, భీముడిగా సత్యనారాయణ, అభిమన్యుడిగా బాలకృష్ణ.. ఇకపోతే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్.టి.రామారావు కనిపించిన ఈ భారీ చిత్రాన్ని కేవలం నలభై మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.

ఈ సినిమా నిడివి దాదాపు 4 గం.ల17 నిమిషాలు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఏదో ఒక పాత్రలో సుమారుగా నాలుగు గంటలపాటు కనిపిస్తారు. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. కొండవీటి వెంకటకవి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి వంటి వారు ఈ సినిమాకి గీతాలను అందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

4 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

4 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

4 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

4 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

4 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

4 hours ago