Kochiలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. వారం రోజులకు పైగా మెట్రో పిల్లర్పై చిక్కుకుని అవస్థలు పడుతున్న పిల్లిని అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు.
Jawaharlal Nehru Stadium Metro Station సమీపంలోని ఎత్తైన మెట్రో పిల్లర్పై పిల్లి బిక్కుబిక్కుమంటూ తిరుగుతుండటాన్ని ఆటో డ్రైవర్లు గమనించారు. వెంటనే జంతు సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చారు.
మెట్రో సర్వీసులు ముగిసిన తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా, పిల్లి భయంతో సందులో దాక్కోవడంతో హైడ్రాలిక్ క్రేన్ అక్కడికి చేరలేదు. రెండో ప్రయత్నంలో కూడా కొద్ది సేపు సేవలను నిలిపినా పిల్లి కనిపించకపోవడంతో ఆ యత్నం ఫలించలేదు.
అగ్నిమాపక బృందాలు హైడ్రాలిక్ లిఫ్ట్ సహాయంతో మూడో ప్రయత్నంలో పిల్లిని సురక్షితంగా కిందకు దించారు. వారం రోజులుగా తిండి లేక బలహీనంగా మారిన ఆ పిల్లికి వెంటనే ఆహారం అందించారు.
ఇటీవల విడుదలైన Manjummel Boys సినిమాలో గుణ కేవ్స్లో చిక్కుకున్న పాత్ర పేరు ‘సుభాష్’. అదే పేరును ఆటో డ్రైవర్లు ఈ పిల్లికి పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “సుభాష్ను కాపాడాలి” అంటూ స్థానికులు డిమాండ్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్కు మరింత ప్రాధాన్యం లభించింది.
రెస్క్యూ విజయవంతం కావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మెట్రో అధికారుల సహకారంతో ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఒకప్పుడు తన అందం, నటన, నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ప్రముఖ నటి భానుప్రియ గురించి ఇటీవలి కాలంలో సోషల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్యను…
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.…
సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన…
సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు కనిపించే కొన్ని సంఘటనలు మనసును హత్తుకుంటాయి. తాజాగా అలాంటి ఓ మధుర ఘటన నెటిజన్ల హృదయాలను…
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు ఒక కీలక ఊరట లభించింది. దేశానికి అవసరమైన వంటగ్యాస్ సరఫరాలో…