Featured

ఏపీ మహిళలకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా ఇప్పటికే ప్రయోజనం కల్పిస్తుండగా ప్రభుత్వం చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళలకు పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే పశువులు ఉన్న మహిళల నుంచి పాలను అమూల్ ద్వారా కొనుగోలు చేసి, మంచి ధర ఇచ్చి ప్రయోజనం చేకూరేలా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా 18,750 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగదుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, పాడి పశువుల ద్వారా స్థిరపడాలన్నా ప్రభుత్వం తమ వంతు సహాయం చేస్తోంది.

వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా 4.90 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పాడి పశువులు ఉన్నవాళ్లు కాగా మరికొందరు కొత్తగా పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో పాల సేకరణ కేంద్రాలను, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ కోసం జగన్ సర్కార్ 11 లక్షల రూపాయలు ఖర్చు చేయనుండగా పాల సేకరణ కేంద్రం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

48 minutes ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

3 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

3 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

3 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

3 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

3 hours ago