భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). అయితే ఎస్బీఐ తన ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఎవరైన తమ ఆధార్ కార్డుకు పాన్ కార్డుతో లింక్ చేసుకోకపోతే సెప్టెంబర్ 30వ తేదీలోగా లింక్ చేయాలని.. లేదంటే బ్యాంకింగ్ సదుపాయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.
అంతే కాకుండా ఖాతాను కూడా నిలిపివేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆధార్ తో పాన్ నంబర్ ను లింక్ చేయాలని ప్రతీ సారి చెబుతూనే ఉన్నా.. చాలామంది దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇది ఒక హెచ్చరికలాంటిది అంటూ పేర్కొంది. సెప్టెంబర్ 30లోపు పాన్ కార్డు, ఆధార్లను లింక్ చేయకపోతే, పాన్ కార్డు ఇన్యాక్టివ్ కావడమే కాకుండా.. మరే ఇతర లావాదేవీలకు పని చేయదంటూ తెలిపింది.
ఇప్పటికే లింక్ గడవు ఎప్పుడో ముగించాలి.. కానీ కరోనా కారణంగా ఇలా వాయిదా వేయాల్సి వచ్చిందిని బ్యాంక్ అధికారులు తెలిపారు. డీమ్యాట్ ఖాతాలు తెరవడం, స్థిరాస్తుల లావాదేవీలు, అకౌంట్ ఓపెనింగ్, నగదు జమ చేయడం వంటి లావాదేవీలన్నింటికీ పాన్ కార్డు తప్పనిసరి అంటూ స్పష్టం చేసింది. లింక్ చేయాలని అనుకునే వారు ఇన్ కం ట్యాక్స్ వెబ్ సైట్ లో ఆధర్ పాన్ లింక్ పై క్లిక్ చేసి చేయొచ్చు. లేదా SMS ద్వారా కూడా లింక్ చేయొచ్చు.
అదెలా అంటే.. UIDPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ 10 అంకెల PAN నెంబర్ టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయండి. తర్వాత కొన్ని గంటల తర్వాత లింక్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…