Pandanti Kaapuram Movie : సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో తన 60వ సినిమాగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి అది సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమాకి మహిళా ప్రేక్షకులు అంతగా రాలేదని వారిని ఆకట్టుకోవడానికి ఒక కుటుంబ కథా చిత్రం తీయాలని తమ్ముళ్ళతో సంప్రదించి బాలీవుడ్ లో రాకేష్ ఖన్నా హీరోగా వచ్చిన దో రాస్తే సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించ్చారట. కానీ అది ఫలించలేదు, తరువాత కొన్ని సినిమాలు తీసిన తరువాత నటుడు ప్రభాకర్ రెడ్డి గారు దో రాస్తే, ఇంగ్లీష్ మూవీ ది విజిట్ సినిమాలు కలిపి కథా తయారు చేయగా సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోవడంతో పండంటి కాపురం సినిమా మొదలు అయ్యింది.
పండంటి కాపురం సినిమాకు పోటీగా భానుమతి మరో ప్రయత్నం……..
సినిమా కథ గురించి పాత్రలు గురించి చర్చిస్తుండగా కృష్ణ తమ్ముడు హనుమంతరావు సినిమాకు పండంటి కాపురం టైటిల్ చెప్పగా అందరికి నచ్చడంతో దానిని పెట్టారు. అయితే సినిమాలు నలిగి అన్నదమ్ములుగా ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ లుగా అనుకోగా, సినిమాలో రాణి మాలిని దేవి పాత్ర కోసం భానుమతి గారిని సంప్రదించారట. భానుమతికి కూడా కథా నచ్చడం, ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే పండంటి కాపురం సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పడంతో అందరి డేట్లు తీసుకున్నాక ఇపుడు ఆమె కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందని భావించి ఆ పాత్రకు జమున గారిని తీసుకున్నారట.
అయితే దీనికి కోపం తెచ్చుకున్న భానుమతి గారు ఇంగ్లీష్ సినిమా ది విజిట్ అదారంగా ఈ సినిమా తీయబోతున్నారు కాబట్టి ఆ సినిమాని నేను తిస్తె బాగుంటుంది అన్న ఆలోచనతో గుమ్మడి గారిని సంప్రదించిందట. అయితే గుమ్మడి గారు పండంటి కాపురం సినిమా చేస్తుందటంతో అక్కడ ఈ విషయం చెప్పగా అప్పటికే భానుమతి కి ఎస్వి రంగారావు గారికి పడకపోవడతో అలా ఎలా చేస్తారు అని ఆవేశం చెందారు. అయితే ఈ సినిమాని కృష్ణ గారు అందరికి సహకారంతో ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి సహకారంతో అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసి విడుదల చేయడం అది ఘన విజయం సాదించడం జరిగింది.
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…
హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…
హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…
హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…