Pavitra Lokesh: సినీ నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. మూడో భార్యకు ఇంకా విడాకులు ఇవ్వకుండానే తనకు దూరంగా ఉంటూ ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఇలా వీరిద్దరు సహజీవనం చేయడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చేసిందో మనకు తెలిసిందే. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే తిరిగి నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నరేష్ తనకు కేవలం లైఫ్ పార్టనర్ మాత్రమే కాదని ఒక సపోర్ట్ సిస్టం అని కూడా పవిత్ర లోకేష్ వెల్లడించారు.
చాలాకాలం క్రితం ఓ సినిమా కార్యక్రమంలో భాగంగా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఎప్పుడూ తనకు అండగానే నిలబడుతూ వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక తమ రిలేషన్ గురించి జరుగుతున్న ట్రోలింగ్ తనను చాలా బాధకు గురి చేస్తుందని, ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…