Pawankalyan: సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన స్థాపించిన జనసేన పార్టీ పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మచిలీపట్నంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారపక్ష నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ప్యాకేజీ గురించి మాట్లాడుతూ అధికార పక్ష నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటారని ఈయన ప్యాకేజీ తీసుకుంటూ పలు పార్టీలతో పొత్తుకుదుర్చుకున్నారనీ అధికార పక్ష నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శలపై గతంలో స్పందించిన పవన్ చెప్పు చూపించిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా మరోసారి ప్యాకేజ్ గురించి మాట్లాడుతూ తాను వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడుతున్నారు ఇంకోసారి ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడితే చెప్పు తీసి కొడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.డబ్బు కావాలంటే సంపాదించుకునే స్టామినా తనకు ఉందని తాను రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు.
అందరిలా తాను డబ్బు మనిషిని కాదని,డబ్బు కోసం ఇతరుల నుంచి ప్యాకేజీ తీసుకునే అవసరం తనకు లేదని తెలిపారు. తాను చూడని డబ్బు లేదని,డబ్బు అవసరమైతే కష్టపడి సంపాదించుకుంటానే తప్ప ఇలా ప్యాకేజీ తీసుకొనే అలవాటు తనకు లేదంటూ మరోసారి ఈ సందర్భంగా తాను ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడే వారికి తనదైన స్టైల్ లో పవన్ వార్నింగ్ ఇచ్చారు.ఇలా పవన్ కళ్యాణ్ ఈ సభలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…