Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!
కాకినాడ జిల్లా: పెద్దాపురం వ్యభిచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఈ కేసులో బాధితురాలిగా కనిపించిన ఓ మహిళ గళమెత్తి, తనను భారతి అనే మహిళ బలవంతంగా వ్యభిచారంలోకి దించి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజించిందని తీవ్ర ఆరోపణలు చేసింది.
బాధితురాలు విడుదల చేసిన వీడియోలో చేసిన ఆరోపణల ప్రకారం – భారతి తనను బంధించి వ్యభిచారం చేయించిందని, గర్భం దాల్చిన తర్వాత కూడా తనపై అదే పని కొనసాగించిందని తెలిపింది. పైగా, తాను పారిపోవాలని చూస్తే బిడ్డతో కలిసి చంపుతానంటూ బెదిరించిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రాణహాని ఉందని, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించక ఇంటికి రానివ్వడం లేదని వాపోయింది.
దీనిపై ప్రధాన ఆరోపణలలో ఉన్న భారతి స్పందిస్తూ సంచలన వాఖ్యాలు చేసింది. ఆ మహిళ లెస్బియన్ అని, తన పదేళ్ల కూతురిని లైంగికంగా వేధించేదని ఆరోపించింది. తాను మానసికంగా ఎంతో వేధింపులకు గురైనట్లు చెప్పిన భారతి, ఈ కారణంగా తన కుమార్తె ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని వెల్లడించింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని, వ్యభిచార గృహం నడిపిన విషయం నిజమే అయినప్పటికీ, ఆ మహిళ క్యారెక్టర్ గురించి తెలిసిన వెంటనే ఇంటి నుంచి పంపించానని పేర్కొంది. పైగా, ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది.
ఇక ఈ కేసుపై కాకినాడ జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బుధవారం రాత్రి పెద్దాపురంలో ఉన్న అనేక అనుమానిత వ్యభిచార గృహాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని అరెస్టు చేసినట్టు సమాచారం. బాధితులైన కొందరు మహిళలు బయటకు వచ్చి ఆరోపణలు చేయడం, ప్రధాన ఆరోపణలపై నిందితురాలిగా ఉన్న భారతి కౌంటర్ ఆరోపణలు చేయడంతో కేసు మరింత చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం పోలీసుల దృష్టిలో ఈ కేసు చాలా సీరియస్గా ఉంది. విచారణ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వాదోపవాదాలతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…