Featured

Political analyst Rajesh Apapsani : బల్ల గుద్ది చెబుతున్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడో లేదో కానీ…2024 తరువాత చేసేది మాత్రం ఇదే….: పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని

Political Analyst Rajesh Appasani : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్ని జగన్ మరోసారి సీఎం అవ్వకుండా చూడాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే మరోవైపు టీడీపీ నేత లోకేష్ కూడా యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ సీజన్డ్ పొలిటిషన్ లాగ కనపడగా వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చి జగన్ విధానాలను ఎండగడుతున్న విధానం చూస్తుంటే ఈ సారి ఎన్నికలలో పవన్ ప్రభావం చూపగలడు అనిపిస్తుంది. ఇక ఈ అంశం గురించి పవన్ అసలు సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాలను రాజకీయా విశ్లేషకులు రాజేష్ అప్పసాని మాట్లాడారు.

పవన్ సీఎం అవ్వకపోవచ్చు కానీ….

రాజేష్ అప్పసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గతంలో లాగ లేరు. ఓటమి తరువాత పార్టీ ఎత్తేస్తారు అన్నవాళ్ళ నోర్లు మూయించి పార్టీ ని తనతో నడిచిన వారికీ భరోసా ఇస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచి సీఎం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా అసెంబ్లీ కి వెళ్తాడు. అలాగే మరింత పార్టీని బలోపేతం చేసుకోగలుగుతాడు.

టీడీపీ తో పొత్తు పెట్టుకుంటాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా వ్యతిరేక ఓటు చీల్చకుండా జగన్ ను గద్దే దించడమే లక్ష్యంగా పవన్ సాగుతున్నారు. టీడీపీ కూడ ఈసారి జగన్ రాకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకే ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉంది అంటూ రాజేష్ అభిప్రాయపడ్డారు. అయితే 2024 ఎన్నికల తరువాత మాత్రం పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago