Ponniyin Selvan : మణిరత్నం డైరెక్షన్ లో తన కలల ప్రాజెక్ట్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30 న విడుదల అయింది. ఇక మొదటి బొమ్మ ఆల్రడీ పడిపోవడంతో ఇక సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో కొంతమంది ప్రేక్షకులు సినిమా ఎలా ఉందో చెప్పేసారు. కల్కి రచన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం 155 రోజుల్లో మణిరత్నం పూర్తి చేయడం విశేషం. ఇక సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్ వంటి వారు నటించారు. ఇక అచ్చంగా ఆరవ కథ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా మీద బాగా అంచనాలు ఉన్నాయి. నాలుగేళ్ళ విరామం తరువాత మణిరత్నం సినిమా అవడం, అందునా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో మంచి అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నది తెలుసుకుందాం.
తమిళ ప్రేక్షకులు ఓకే.. మరి తెలుగు ప్రేక్షకుల సంగతి…
పొన్నియన్ సెలవన్ కల్కి రచన ఆధారంగా తెరకెక్కింది. సినిమాలో పాత్రల పేర్లు, సంస్కృతి అంతా తమిళ కల్చర్. ఇక ఇది వారికి ఓకే కానీ మరి ఇతర భాషల వారి పరిస్థితి ఏమిటి అంటే పొన్నియన్ సెల్వన్ మాతృక నవల చదివిన వారికి త్వరగా ఎక్కుతుందంటూ కొంతమంది ట్విట్టర్ ద్వారా సలహా ఇస్తున్నారు. 155 రోజుల్లో మణిరత్నం మ్యాజిక్ చేశాడంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. మొదటి భాగం సస్పెన్స్ తో తీసుకెళ్తూ రెండవ భాగం లో డ్రామా కంటిన్యూ చేసి ఎక్కడా లాగ్ అవ్వకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాదంటూ చెబుతున్నారు మరి కొంతమంది.
ఇక ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం పాటలకంటే బిజీఎం అదిరిందంటూ చెబుతున్నారు. నందిని పాత్రలో ఐశ్వర్య, కుందవి పాత్రలో త్రిష, ఇక కార్తీ నటన చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. చాలా వరకు కార్తీ నటన ను మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ ఓడ ఫైట్ ఇంకా బాగా తీసి ఉండొచ్చు అంటూ మరి కొంతమంది అభిప్రాయ పడినా హాలీవుడ్ రేంజ్లో మణిరత్నం విజువల్ ఎఫెక్ట్స్ చూపించాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు సినిమా ఎక్కడానికి టైం పడుతుంది కానీ సినిమా ఓకే అనే అభిప్రాయం వినబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఆ బిజినెస్ దాటిందంటే హిట్ అయినట్లే ఇక తమిళ ప్రేక్షకులు మాత్రం విజయం సాధించేసాం అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…