పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. దీని తర్వాత మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో ప్రభాస్ కు కాస్త విరామం దొరికింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముంగించుకుంది.
త్వరలోనే ఈ సినిమా మిగిలిన పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతోపాటుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాం నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సలార్ ఎం ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రభాస్ మాస్ గెటప్ లో అదరగొట్టాడు.
ఈ సినిమాతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ , నాగ్ అశ్విన్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నడని తెలుస్తుంది. ‘వార్’ వంటి యాక్షన్ సినిమాలతో ‘ఔరా’! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘కత్రినా కైఫ్’ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు.
ఇటీవల ప్రభాస్ సినిమాల్లో బాలీవుడ్ భామలు మెరుస్తున్న విషయం తెలిసిందే..ఇటీవలే సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రాద్ధకపూర్ నటించగా, ఆదిపురుష్ లో కృతిసనన్ నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కత్రినా కైఫ్ కూడా చేరబోతుందని సమాచారం..మొత్తానికి ప్రభాస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్లకే వరుస అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది..!!
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…