Priyanka Chopra: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ కి దూరంగా ఉంటూ హాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తోంది.
అంతేకాకుండా ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఎప్పటికప్పుడు సరికొత్త స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రియాంక చోప్రా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యల వల్ల నటిజన్ లు మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
ఇటీవల ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకి వచ్చిన ప్రియాంక చోప్రాని ‘ ఆర్ఆర్ ఆర్ సినిమా చూశారా అని ప్రశ్నించగా… సినిమా చూసే సమయం తనకు లేదని, తాను సినిమాలు చూడనని,టీవీ షోలు ఎక్కువగా చూస్తుంటా అంటూ ప్రియాంక సమాధానం ఇచ్చింది. దీంతో భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదని ప్రియాంక చెప్పటంతో నెటిజన్లు ఆమె మీద మండిపడుతున్నారు.
సినిమాల వల్ల ఎంత బిజీగా ఉన్నా కూడా మన దేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన ఆర్ ఆర్ ఆర్ వంటి గొప్ప సినిమా చూడటానికి ఆమె దగ్గర మూడు గంటల సమయం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆస్కార్ అవార్డు కోసం యూఎస్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీం కి ప్రియాంక చోప్రా స్వయంగా ఆతిథ్యం ఇచ్చింది. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడలేదని చెప్పటంతో స్టార్ హీరోయిన్ అయ్యుండి ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదని చెప్పటంతో సోషల్ మీడియాలో ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ వల్ల ప్రియాంక విమర్శలపాలవుతోంది.
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…