Producer Ashwini Dutt : వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత అశ్విని దత్. రాఘవేంద్ర రావు, అశ్విని దత్ కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. ఇక చాలా మంది యంగ్ హీరోస్ ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసిన బ్యానర్ వైజయంతి మూవీస్. కొన్నేళ్లుగా సినిమా నిర్మాణంకి దూరంగా ఉన్న అశ్విని దత్ ప్రస్తుతం కూతుర్ల నిర్మాణంలో వస్తున్న హిట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతా రామం వంటి సినిమాలను నిర్మించింది ఆయన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్. కూతుర్ల సక్సెస్ మరింత ఆనందాన్ని ఇస్తోందంటూ చెబుతున్న అశ్విని దత్ తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు అంశాలను గురించి మాట్లాడారు.
ఆయన మాత్రమే గొప్ప నాయకుడు…
అశ్విని దత్ గారు వైజయంతి ఆర్ట్స్ బ్యానర్ పేరును ఎన్టీఆర్ గారి సలహా మేరకు పెట్టారు. అలానే ఆయన కృష్ణుడు రూపంలో ఉన్న బొమ్మ ఆ బ్యానర్ పై ఉంటుంది. ఎన్టీఆర్ గారంటే దేవుడు అనే అశ్విని దత్ గారు ఆయనతో కలిసి తిరిగినపుడు అయన గొప్పతనం మరింత తెలిసిందని చెబుతారు. ఆయన నటుడు ఎలా ఉండాలో నెక్స్ట్ తరాలకు నేర్పించారు అంటూ చిరంజీవి గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న తేడా గురించి మాట్లాడుతూ ఇద్దరూ గొప్ప వాళ్ళే, ఎన్టీఆర్ గారు నటుడు ఎలా ఉండాలో చూపించి క్రమశిక్షణ నేర్పించి పోతే చిరంజీవి గారు దాన్ని తన ముందు తరాలకు చూపిస్తున్నారు. ఎవరికి వారు ఇద్దరూ గొప్పవాళ్లే అంటూ తెలిపారు.
ఇక తాను శక్తి సినిమా వల్ల ఏకంగా 32 కోట్లు నష్టపోయాను, ఆ సినిమా తరువాత ఇక సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పార్టీ కోసం తనవంతుగా ఈ సారి ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగస్వామ్యం అవుతాను. టీడీపీ తరుపున ప్రచారం చేస్తాను అంటూ చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి మేలు చేసిన మొదటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఆయన వల్లే హైదరాబాద్ కు ఇండస్ట్రీ రాగలిగింది. ఆపైన ఇండస్ట్రీని బాగా అక్కున చేర్చుకుంది చంద్ర బాబు గారు. ఆయన కష్టపడే తత్త్వం చూసాకనే ఆయనతో కలిసి పనిచేయాలని అనిపించింది అంటూ తెలిపారు.
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారాయి. తక్కువ నిద్ర, ఒత్తిడి, స్క్రీన్…
వంటగదిలో శుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. మనం ఉపయోగించే పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుంటాం. అయితే రోజూ…
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…