Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న సెల్ ఫోన్ అలాగే లెటర్ ను మాయం చేసిన పిఏ కృష్ణా రెడ్డి గారిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ తరువాత ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ హత్య గురించి అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి అల్లుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ల గురించి కీలక వాఖ్యలు చేసారు. ఆ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.
అతను చెప్పినందుకే అలా చేశాను…
అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడుతూ కృష్ణా రెడ్డి గారు హత్య ఎవరు చేసారు అనే విషయాలను మాట్లాడలేదు. తాను ఎవరి వైపు ఉన్నారని చెప్పలేదు. కానీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిబిఐ వారు తనను విచారించినపుడు బాగా కొట్టారని, వేళ్ళు వంగిపోయి ఇంకా నొప్పిగానే ఉన్నాయని, కోలుకోవడానికి ఏడాది పడుతుంది అంటూ చెప్పారు. ఈ విషయాలను కోర్టులో అవినాష్ రెడ్డి తరుపు లాయర్ గనుక ప్రస్థావిస్తే సిబిఐ ఇరుకులో పడుతుంది. ఇక సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చెబితేనే తాను ఫోన్ అలాగే లెటర్ దాచిపెట్టినట్లు పోలీసులకు చెప్పారు. ఈ విషయం రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. పోలీసులు వచ్చాక కూడా ఇవ్వకుండా దాచిపెట్టి కూతురు వచ్చాక ఆమెకే ఇచ్చారట కృష్ణా రెడ్డి.
ఇక వివేకానంద ఇంటికి ఉదయం ఐదు గంటలకే వెళ్లిన ఆయన తలుపు తీయలేదని ఆయన భార్య సౌభాగ్యమ్మ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆపైన చనిపోయారని తెలిసాక మొదట ఫోన్ రాజశేఖర్ రెడ్డి గారికే చేసారు, వివేకానంద తరువాత కృష్ణా రెడ్డి గారికి బాస్ రాజశేఖర్ రెడ్డి గారే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణా రెడ్డి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సునీత తన మీద కోప్పడినపుడు కూడా తానే మనకు సహాయం చేసేవాడు అతను మనకు వ్యతిరేకం అయితే కేసు మన మీదకే వస్తుంది అంటూ రాజాశేఖర్ రెడ్డి గారు అన్నారు అంటూ చెప్పడం ఇప్పుడు కీలకంగా ఉంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు.…
భారతదేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వయసున్న…
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం,…
ఈ మధ్యకాలంలో చాలా మంది అకస్మాత్తుగా వచ్చే నడుము నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా నిద్రపోవడం…
మహారాష్ట్రలో తాజాగా నమోదైన బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో హెచ్5ఎన్1 వైరస్…
ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు పప్పుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే…