సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన కామెడీతోఎంతోమందిని ఆకట్టుకున్న పృథ్విరాజ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.
పృధ్విరాజ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిలో ఉన్న పృద్విరాజ్ కొన్ని ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వి రాజా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రోలింగ్ అంటే పృథ్వీరాజ్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా చాలామంది తన గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారని అయితే వాటన్నింటి గురించి తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.అయితే సన్నిహితులు బంధువులు వాటిని చూసినప్పుడు నాకు చెబుతున్నారని, అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని పృథ్విరాజ్ తెలియజేశారు. కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించలేనివారు, ఎలాంటి పని పాట లేనివారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తుంటారని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
అయితే గతకొద్ది రోజుల కిందట పృధ్విరాజ్ ఎవరినో గోకారంటూ పెద్ద ఎత్తున నా పై కామెంట్ చేస్తున్నారు. అలా తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగదని, ఈ సందర్భంగా పృధ్విరాజ్ తెలియజేశాడు. ఏ విధమైనటువంటి పని పాట లేనివారు ఎలాంటి కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకు రా వెధవల్లారా అంటూ పృథ్వి రాజ్ తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…