Featured

ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ కొత్త రూల్స్.. ఆ ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోలేమా..?

దేశంలో రోజురోజుకు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంక్ ఖాతాలలో డబ్బులు దాచుకుని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే దిశగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అడుగులు వేస్తోంది.

దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోవడం సాధ్యపడదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది.

బ్యాంక్ ఈ నిర్ణయం వల్ల మోసపూరిత లావాదేవీలకు సులభంగా చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. కార్డు ఏటీఎంలో పెట్టిన తరువాత ఏటీఎంలో లేకుండా వెంటనే వెనక్కు తీసుకోగలిగే ఏటీఎంలను నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లని అంటారు. నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లలో మ్యాగ్నటిక్ స్ట్రిప్ ద్వారా ఏటీఎం మెషీన్ డేటాను తీసుకుంటుంది. ఈ విధంగా కాకుండా పని ఏటీఎం మెషీన్ లోనే కార్డు ఉండే ఏటీఎంలను ఈఎంవీ ఏటీఎం అని చెబుతారు.

ఈఎంవీ ఏటీఎంలలో మెషీన్ కార్డుపై ఉండే చిప్ నుంచి డేటాను తీసుకోవడం ద్వారా ఏటీఎంలు పని చేస్తాయి. భవిష్యత్తులో ఇతర బ్యాంకులు సైతం ఇదే తరహా నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.    https://twitter.com/pnbindia/status/1349710359570092038/photo/1

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

8 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

8 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

8 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

8 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

8 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

8 hours ago