Puri Jagannath: పూరి జగన్నాథ్ పరిచయం అవసరం లేని పేరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ వారి కెరియర్ లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ సినిమాని అందించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా పూరి డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వారే అని చెప్పాలి.
ఇకపోతే పూరి దర్శకత్వంలో సుమారు 17 సంవత్సరాల క్రితం మహేష్ బాబు ఇలియానా జంటగా నటించిన చిత్రం పోకిరి.ఇప్పటివరకు ఇలాంటి సినిమా పూరి దగ్గర నుంచి రాలేదని మహేష్ బాబు కెరియర్ లో కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా మరొకటి రాలేదని చెప్పాలి.ఇప్పటికి పోకిరి సినిమా చూసిన చాలా ఫ్రెష్ గానే అనిపిస్తుంది అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు నేను అన్ని సినిమా స్టోరీలు రాసే విధంగానే ఒక మంచి కథ రాసానని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ స్థాయిలో హిట్ అవుతుందని అసలు ఊహించలేదని ఈయన తెలియజేశారు.ఇక ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో అసలు ఈ సినిమాలో ఏముందని ఇంత సక్సెస్ అయిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను.
అందుకే ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా సినిమా వేసుకొని చూడగా సినిమా సక్సెస్ అవ్వడానికి సినిమాలో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని తెలియజేశారు. అయితే ఏ సినిమా ఎప్పుడు ఎలా హిట్ అవుతుంది? ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…