Rahul Ramakrishna: రైలు ఘటనపై కామెడీ చేసిన రాహుల్ రామకృష్ణ… బుద్ధుందా అంటూ మండిపడుతున్న నేటిజన్స్!

Rahul Ramakrishna:ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకేసారి మూడు రైలు ఢీకొనడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు.ఇంత విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలలో మానవత్వం పరిమళించి క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు రక్తదానం చేస్తున్నారు.

ఇలా ఈ రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో కలిసి వేసింది అయితే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మాత్రం రైలు ప్రమాద ఘటనపై కామెడీ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తనపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశారు అనే విషయానికి వస్తే…

రైలు ప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సమయంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో హాలీవుడ్ నటుడు బస్టర్ కీటన్ సైలెంట్ అనే సినిమాలో రైలు ముందు చేసే విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో నేటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఆ వీడియో డిలీట్ చేశారు. ఓ పక్క వందల కుటుంబాలలో మరణాలు సంభవించి అందరూ బాధపడుతుంటే మీకు కామెడీగా ఉందా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Rahul Ramakrishna: ఒట్టేసి చెబుతున్నా… క్షమించండి…


దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ మరొక ట్వీట్ చేశారు. నిజానికి నాకు ఈ ఈ ఘటన గురించి ఏమాత్రం తెలియదు అర్ధరాత్రి నుంచి నేను స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను అందుకే న్యూస్ అప్డేట్ కాలేదని అందుకే తన వల్ల జరిగిన ఈ తప్పిదానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి మరొక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.