Rahul Ramakrishna:ఒడిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకేసారి మూడు రైలు ఢీకొనడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు.ఇంత విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రజలలో మానవత్వం పరిమళించి క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి వేల సంఖ్యలో ప్రజలు రక్తదానం చేస్తున్నారు.
ఇలా ఈ రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగానో కలిసి వేసింది అయితే కమెడియన్ రాహుల్ రామకృష్ణ మాత్రం రైలు ప్రమాద ఘటనపై కామెడీ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా తనపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈయన చేసిన ట్వీట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అట్వీట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశారు అనే విషయానికి వస్తే…
రైలు ప్రమాదం జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సమయంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో హాలీవుడ్ నటుడు బస్టర్ కీటన్ సైలెంట్ అనే సినిమాలో రైలు ముందు చేసే విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. దీంతో నేటిజన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఆ వీడియో డిలీట్ చేశారు. ఓ పక్క వందల కుటుంబాలలో మరణాలు సంభవించి అందరూ బాధపడుతుంటే మీకు కామెడీగా ఉందా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దీంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ మరొక ట్వీట్ చేశారు. నిజానికి నాకు ఈ ఈ ఘటన గురించి ఏమాత్రం తెలియదు అర్ధరాత్రి నుంచి నేను స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాను అందుకే న్యూస్ అప్డేట్ కాలేదని అందుకే తన వల్ల జరిగిన ఈ తప్పిదానికి తాను క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి మరొక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…