Railway Track: సాధారణంగా దొంగలు బ్యాంకులకు ఖన్నం వేయడం లేదా ఇళ్లల్లో చోరీ చేయడం వంటివి జరగడం మనం వినే ఉన్నాం. అయితే మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ లను దొంగతనం చేయడం విన్నారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఓ దొంగలు ముఠా ఏకంగా రైల్వే ట్రాక్ పై కన్ను వేసి రైల్వే ట్రాక్ ను మాయం చేయడమే కాకుండా స్క్రాప్ కింద అమ్మేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
రైల్వే సిబ్బంది చేతి వాటం ప్రదర్శించడంతో ఇదే అధునుగా భావించిన దొంగల ముఠా అక్కడ రైల్వే ట్రాక్ ఉందని ఆనవాళ్లు కూడా లేకుండా రైల్వే ట్రాక్ దొంగలించి స్క్రాప్ కింద అమ్మేసి సొమ్ము చేసుకున్న ఘటన బీహార్ లోని మధుబని జిల్లాలోని బెలాహీలో చోటు చేసుకుంది. అయితే తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది.అయితే ఈ మిల్ మూతపడటంతో గత రెండు దశాబ్దాలుగా ఈ రైల్వే ట్రాక్ పై రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఇలా ఆగిపోయిన రైల్వే ట్రాక్లను అధికారులు స్క్రాప్ కింద అమ్మేయడం జరుగుతుంది కానీ అధికారులు ఈ రైల్వే ట్రాక్ గురించి పట్టించుకోకపోవడంతో కొందరు దొంగల ముఠా రైల్వే అధికారుల సహాయంతో ఈ రైల్వే ట్రాక్ దొంగలించి స్క్రాప్ కింద అమ్మేశారు.
అసలు ఈ ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ ఉంది అనే ఆడవాళ్లు కూడా కనిపించని విధంగా ఈ రైల్వే ట్రాక్ ను మోసం చేశారు. అయితే ఆ దొంగలు ఆర్ పీఎఫ్ సిబ్బందితోకలిసి ఈ దారుణానికి పాల్పడటంతో ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఇద్దరు సిబ్బందిపై వేటు వేశారు అయితే పూర్తి విచారణ చేసిన తర్వాత ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…