Categories: FeaturedMovie News

సుహాసినిని మణిరత్నంతో కలపడానికి రజినీకాంత్ చేసిన పెద్ద సాహసం ఏంటో తెలుసా

సీనియర్ నటి సుహాసిని, దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ గారి కూతురు. సుహాసిని తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. అయితే ఇక 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమ నటి) అవార్డును అందుకున్నది.

ఇక మణిరత్నం గారి సంగతి విషయానికి వస్తే… వారి తండ్రి గారు, అన్నదమ్ములు అందరు సినీ ప్రస్థానంలో అనుభవం కలిగిన వారే. దీంతో ఆయనకు సినిమా రంగం వైపు అడుగు పెట్టడానికి ఒక ముఖ్య నేపథ్యం. ఇక ఈయన సినీ ప్రస్థానం మొదలు కన్నడ భాషలో పల్లవి-అనుపల్లవి అను చిత్రం కోసం తీయడానికి ప్రయత్నించగా ఇందులో నటించడానికి సుహాసినిని సినిమా చేయమని అడగడానికి వెళ్ళగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీనికి కారణం ఆవిడ మణిరత్నం మీరు ఇంతవరకు ఎన్ని సినిమాల్లో డైరెక్ట్ చేశారు అని అడగగా మణిరత్నం ఇదే నా మొదటి సినిమా అని చెప్పారంట. ఇంకా అప్పుడు ఆవిడ ఆ సినిమాను చేయడం కుదరదని తేల్చి చెప్పడంతో మణిరత్నం నిరాశతో వెనుదిరిగారు.

అయితే ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించమని ఆయన అడగగా అప్పుడు కూడా సుహాసిని నేను చేయను అని చెప్పడంతో మళ్లీ వెనుదిరిగాడు మణిరత్నం. అయితే రెండు సార్లు ఆమె ఒప్పుకోకపోయినా ఆవిడ పట్ల ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు మణిరత్నం. అయితే ఆ తర్వాత మణిరత్నం చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వగా, ఆ తర్వాత మౌనరాగం అనే సినిమాని తెలుగులో తీసి అది విజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో తమిళ సీనియర్ యాక్టర్ అయినా కమల్ హాసన్ తో నాయకన్ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా తను సినిమాలతో బిజీబిజీగా ఉండగా మరోవైపు సుహాసిని ఒప్పుకున్న చిత్రాలతో తను కూడా బిజీగా ఉంటే ఎవరికి వారి జీవితాల్లో గడిపేస్తున్నారు. అయితే ఇక ఆ తర్వాత మణిరత్నం, రజినీకాంత్ చేస్తున్న దళపతి చిత్రం సమయంలో రజినీకాంత్ మణిరత్నం మాట్లాడుతున్న సందర్భంలో సుహాసిని విషయం అక్కడ ప్రస్థానం వచ్చింది.

అయితే ఇక్కడ రజనీకాంత్ మణిరత్నంకు సుహాసిని పై చూపించే ఆసక్తిని గమనించాడు. దీనితో ఆ తర్వాత మణిరత్నంను సుహాసినితో మాట్లాడి తన విషయాన్ని చెప్పమని చెప్పాడు. అయితే దానికి మణిరత్నం ఆలోచిస్తుండగా రజనీకాంత్ స్వయంగా ఆ విషయంలో చొరవ తీసుకోని ఒక ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసుకొని మీరు అక్కడ కలుసుకోండి అని చెప్పి, ఆ తర్వాత వారిని ఒక డిన్నర్ ప్లాన్ చేయించి వారిని ఏకాంతంగా మాట్లాడామని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంతే ఆ తర్వాత వారిద్దరు కొన్ని రోజులపాటు ప్రేమను కొనసాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నారు. అబ్బాయి పేరు నందన్. ఇక మొత్తానికి రజినీకాంత్ చొరవ చూపడంతో మణిరత్నం సుహాసిని కలిశారని చెప్పవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

2 minutes ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

4 minutes ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

7 minutes ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

15 minutes ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

22 minutes ago

ధ్యానంలో గజ్జెల చప్పుళ్లు… భక్తులకు దివ్య అనుభవమా లేక భావనా?

ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…

28 minutes ago