Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈయనకు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈయనకు భార్య పిల్లలు ఉండగా చివరి రోజులలో మాత్రం అనాధ ఆశ్రమంలో చేరారు.
ఈయన చివరి రోజులన్నీ కూడా అబ్దుల్లాపూర్ మేట్ లోఉన్నటువంటి అనాధ ఆశ్రమంలో చేరారు. అయితే ఈయన ఇక్కడ చేరడానికి గల కారణాలను కూడా ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ తెలియజేశారు.తాను మానసికంగా ఎంతో ఆవేదన చెందిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా అనాధ ఆశ్రమంలో చేరానని తెలిపారు.
తాను ఉంటున్న ఇంటి ఓనర్ తో ఒకరోజు కారు పార్కింగ్ విషయంలో గొడవపడ్డాను తనతో గొడవ పడిన తర్వాత అక్కడ ఉండాల్సిన అవసరం లేదని భావించిన నేను తన భార్య పిల్లల వద్దకు వెళ్లగా తన భార్య తనని ఇంట్లోకి రానివ్వలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు..తన వల్ల తన పిల్లలకు హాని జరుగుతుందని ఆమె తనని ఇంట్లోకి రానివ్వకుండా నేను చనిపోయిన నా మొహం కూడా చూడనని చెప్పేసింది.
నేను ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సమయంలో రామ్ చరణ్ అభిమానులు తన కొడుకుని బాగా కొట్టారు ఆ భయం కారణంతోనే తన భార్య తనని ఇంట్లోకి రానివ్వకుండా చచ్చిన నా మొహం చూడను అంటూ మాట్లాడిందని తన మాటలలోని బాధ నాకు అర్థం కావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక మానసికంగా బాధను అనుభవిస్తూ అనాధ ఆశ్రమంలో చేరాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…