Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈయన ఫ్యామిలీకి కూడా ఎంతో సమయం కేటాయిస్తూ తన కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా వంటింట్లోకి వెళ్లి తన అమ్మ కోసం ప్రత్యేకంగా వంట తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇందులో భాగంగా ఉపాసన తన అత్తయ్య వద్దకు వెళ్లి అత్తయ్య గారు కిచెన్ లో ఏమవుతుంది అంటూ అడగడంతో ఆమె దోసే అవుతుంది ఈరోజు నా కొడుకు నాకోసం దోశ చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పారు.
ఉమెన్స్ డే కావడంతో స్పెషల్ గా వంట చేస్తున్నారని చెప్పడంతో ఉపాసన ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే ఎంతో బాగుండు అంటూ మాట్లాడారు అనంతరం రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారు అని అడగగా దోస పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పారు.
వంట చేస్తున్న చరణ్..
ఇలా తల్లి కోసం ఈయన ప్రత్యేకంగా గరిట చేతపట్టి వంటలు చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…