Ramanaidu Studio: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒక విషయంపై హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతకగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామానాయుడు గారు విశాఖపట్నంలో కూడా ఓ స్టూడియో నిర్మించాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున ఓ విశాలవంతమైన స్థలాన్ని భారీ ధరలకు కొనుగోలు చేశారు. అయితే తన తండ్రి కలను ఎలాగైనా నెరవేర్చాలని సురేష్ బాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు ఈయన వెల్లడించారు.
విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం కోసం కేటాయించిన స్థలం పై సీఎం జగన్ భార్య భారతి కన్ను పడటంతో భార్య కోరిక మేరకు జగన్ సురేష్ బాబుని పిలిపించి బెదిరించి మరి బలవంతంగా కాగితాలపై సంతకం పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సురేష్ బాబు స్వయంగా నాతో చర్చించాడని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఈ భూమి కబ్జా విషయంపై సురేష్ బాబు తనతో మాట్లాడుతూ బెదిరించి మరి సంతకం పెట్టమన్నారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేను సంతకం పెట్టానని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారంటూ మాజీ మంత్రి మీడియా సమావేశంలో భాగంగా తెలియజేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై నిర్మాత సురేష్ బాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…