Senior Actor Narasimharaju : నాగేశ్వరావు గారిని చూసి నెను అలానే ఉంటాను సినిమాలలోకి వెళితే బాగుంటుందనే ఆలోచనతో చదువు మధ్యలో వదిలేసి మద్రాస్ కు అవకాశాలకోసం వెళ్లిన నరసింహారావు రాజు గారు తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు . 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా వడ్లమూరు గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
పిలిచి అవకాశం ఇస్తే చేయనని అక్కడే చెప్పేసాను…
1985 తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నరసింహారాజు గారు అటు సీరియల్స్ లో కూడా బాగా నటించేవారు. తమిళం చాలా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహారాజు గారు తెలుగులో కృష్ణవంశీ గారి ‘సింధూరం’ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించారు. ఇక మళ్ళీ కృష్ణ వంశీగారి సినిమా ‘మురారి’ లో మహేష్ బాబు గారి పెద్దన్నయ్య క్యారెక్టర్ లో నటించడానికి అడిగితే నర్సింహారాజు గారు చేయనని చెప్పేసారట.
లక్ష్మి గారి పక్కన ఆమె భర్త గా సరిపోనని సన్నగా అంత ఎత్తుగా ఏమీ ఉండక పోవడం వల్ల ఆమె భర్తగా బాగోనని అదీకాక కైకాల సత్యనారాయణ గారు భారీగా ఉంటారు ఆయన కొడుకుగా నేను బాగోనని ఇంకెవరినైనా ట్రై చేయండి అని చెబితే నిజమే మీరు అంటుంటే ఇప్పుడు నాకు అలానే అనిపిస్తోంది అంటూ కృష్ణ వంశీ అన్నారంట. ఇక మరో సినిమాలో కూడా ఇలానే డైరెక్టర్ పాత్ర చెప్పాక నేను నప్పనని చెప్పాను, నాకు అనిపిస్తే అక్కడే చెప్పేస్తా వాళ్ళివ్వరు కదా అని చేస్తే స్క్రీన్ మీద తెలిసిపోతుంది కదా ఆ పాత్రకు సరిపోయామా లేదా అని అంటూ అందుకే చాలా సినిమాల్లో చేయలేదంటూ చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…