Ramya Krishna: ఆ సీన్ చేసే ముందు ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించాను… రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రమ్యకృష్ణ ఒకరు. తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ గారితో కలిసి నరసింహ సినిమాలో నటించాలని ఈ సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ కావడం చాలా విశేషమైన తెలిపారు. అయితే ఈ సినిమాలో తాను నీలాంబరి అనే పాత్రలో నటించానని ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ఉన్న పాత్ర అని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నీలాంబరిగా నేను సౌందర్య చెంపపై కాలు పెట్టే సన్నివేశంలో నటించాను. అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను చాలా ఇబ్బందులకు గురయ్యాను అంటూ ఈమె తెలియజేశారు.

Ramya Krishna: నటించలేకపోయాను…


ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ సౌందర్య పై పగ తీర్చుకోవడం కోసం అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది అయితే ఈ సన్నివేశం విన్న తర్వాత అది నేను చేయలేనని డైరెక్టర్ గారికి చెప్పడంతో ఆయన ఈ సీన్ చాలా అవసరమని చెప్పారు. ఇక డైరెక్టర్ గారు అలా చెప్పేసరికి చేసేది ఏమీ లేక తాను ఈ షాట్ పూర్తి చేశానని తెలిపారు. అయితే ఈ షార్ట్ చేయడానికి ముందు నేను దేవుళ్లను ప్రార్థించి మరి ఈ షార్ట్ చేశానని ఈమె తెలియజేశారు. ఈ సన్నివేశం షూట్ చేయడం పూర్తి అయిన తర్వాత కూడా రెండు మూడు రోజులపాటు తాను ఎంతో కంగారుగా ఆందోళనగానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.