Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా.నటిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను 1999వ సంవత్సరంలో రజనీకాంత్ సరసన నరసింహ సినిమాలో అవకాశమందుకొని స్క్రీన్ షేర్ చేసుకున్నాను సుమారు 24 సంవత్సరాల తర్వాత మరోసారి అవకాశం రావడం విశేషం అని తెలిపారు.
ఇక నరసింహ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ తాను రజనీకాంత్ తో నటించాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో తన పాత్ర ఏంటి అని కూడా ఆలోచించకుండా సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.ఇందులో నాది ఫస్ట్ హీరోయిన్ పాత్రనా లేకపోతే సెకండ్ హీరోయిన్ పాత్రనా అన్న విషయాల గురించి కూడా తాను ఆలోచించలేదని తెలిపారు.
ఇక నాకు సినీ కెరియర్ లో నేను తీసుకున్నటువంటి అత్యుత్తమమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది నరసింహ సినిమాలో నటించడమేనని ఈమె తెలిపారు.ఇక ఈ సినిమాలో తాను సౌందర్య మొహంపై కాలు పెట్టే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం చేసే సమయంలో తాను ఎంతో భయపడ్డాను. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అంటూ ఈ సందర్భంగా నరసింహ సినిమా విశేషాలను రమ్యకృష్ణ మరోసారి గుర్తు చేసుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…