Rangam Bhavishyavaani : ప్రతి ఏడాది ఆషాడంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలను కన్నులపండుగగా జరుపుతారు. ప్రతిసారిలాగేనా ఈ ఏడాది ఘనంగా లష్కర్ బోనాల పండుగ మొదలయింది, రెండో రోజు రంగం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహంకాళి అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది పంటల పరిస్థితి, వర్షాలు, రాజకీయాలు ఇలా అన్నింటి గురించి అమ్మవారు తెలిపారు.
వర్షాలు బాగుంటాయి…
రంగం భవిష్యవాణిని పచ్చికుండ పై నిలబడి స్వర్ణలత అమ్మవారు పూనాక భవిష్యత్తు చెప్పారు. గత ఏడాది ఇచ్చిన హామీలను మరచిపోయారంటూ అమ్మవారు పలికారు. ఈ ఏడాదైనా ఆ హామీలను తీర్చాలని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది వర్షాలు పడుతాయని చెప్పారు.
అయితే అగ్నిప్రమాదలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక తను చూస్తూనే ఉన్నట్లు ప్రతి గడపను కాపాడుతానని అమ్మవారు అభయం ఇచ్చారు. పూజలు అన్నీ చక్కగా నిష్ఠతో చేసారని, తాను ఎవరు ఏమి చేసారో అన్నీ చూస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది లోపు గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పారు. ఇక బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించగా లక్షలాది మంది ఈ ఏడాది బోనాలకు వచ్చారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…