Janasena leader Aruna : ఏపీ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా గురించి వారాహి యాత్రలో మాట్లాడటం వైరల్ అయింది. వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళలను, ఆడపిల్లలను టార్గెట్ చేసి మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ అక్షేపించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇప్పటికే 18 వేల మంది మహిళల ఆచూకీ తెలియరాలేదని ఈ విషయం మీద రివ్యూ మీటింగ్ పెట్టాలని డిజిపి కి జగన్ కి అనిపించలేదా, మీడియాతో సహా అన్ని పార్టీలు ఈ ఇష్యూ మీద ఆలోచించాలి అంటూ మాట్లాడారు. అయితే ఈ విషయం అంతా వదిలేసి వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని అంటే ఎలా అంటూ చాలా మంది మండిపడుతున్నారు. ఇక ఈ ఇష్యూ మీద వైసీపీ, జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఆడవాళ్ళ మీద అన్యాయలు జరిగినపుడు ఏమయ్యావ్…
తాజగా ఈ ఇష్యూ మీద అధికార పార్టీ ప్రతినిధి ఏపీ వుమన్ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కు నోటీసులు ఇచ్చారు. దీని పై స్పందిస్తూ వాసిరెడ్డి పద్మ ఆడవాళ్ళ మీద అన్యాయలు జరిగినపుడు ఎక్కడ ఉన్నారు అంటూ జనసేన మహిళా నేత అరుణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మహిళా అక్రమ రవాణా గురించి మాట్లాడగానే బయటికి వచ్చింది.
ఇన్ని రోజులు ఏంచేస్తోంది. మా నాయకుడికి మహిళా కమిషన్ ద్వారా నోటీసులు ఇచ్చారు ఆయన ఏ మహిళనైనా హింసించారా లేక దౌర్జన్యం చేసారా, ఎందుకు ఇచ్చారు. కేవలం ఆడవాళ్లను తరలిస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్పిందుకు నోటీసులు ఇచ్చారు అంటూ అరుణ ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…