Rangam Bhavishyavaani : ప్రతి ఏడాది ఆషాడంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలను కన్నులపండుగగా జరుపుతారు. ప్రతిసారిలాగేనా ఈ ఏడాది ఘనంగా లష్కర్ బోనాల పండుగ మొదలయింది, రెండో రోజు రంగం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహంకాళి అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది పంటల పరిస్థితి, వర్షాలు, రాజకీయాలు ఇలా అన్నింటి గురించి అమ్మవారు తెలిపారు.
వర్షాలు బాగుంటాయి…
రంగం భవిష్యవాణిని పచ్చికుండ పై నిలబడి స్వర్ణలత అమ్మవారు పూనాక భవిష్యత్తు చెప్పారు. గత ఏడాది ఇచ్చిన హామీలను మరచిపోయారంటూ అమ్మవారు పలికారు. ఈ ఏడాదైనా ఆ హామీలను తీర్చాలని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది వర్షాలు పడుతాయని చెప్పారు.
అయితే అగ్నిప్రమాదలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక తను చూస్తూనే ఉన్నట్లు ప్రతి గడపను కాపాడుతానని అమ్మవారు అభయం ఇచ్చారు. పూజలు అన్నీ చక్కగా నిష్ఠతో చేసారని, తాను ఎవరు ఏమి చేసారో అన్నీ చూస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది లోపు గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పారు. ఇక బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించగా లక్షలాది మంది ఈ ఏడాది బోనాలకు వచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…