Rangam Bhavishyavaani : ప్రతి ఏడాది ఆషాడంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలను కన్నులపండుగగా జరుపుతారు. ప్రతిసారిలాగేనా ఈ ఏడాది ఘనంగా లష్కర్ బోనాల పండుగ మొదలయింది, రెండో రోజు రంగం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహంకాళి అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది పంటల పరిస్థితి, వర్షాలు, రాజకీయాలు ఇలా అన్నింటి గురించి అమ్మవారు తెలిపారు.
వర్షాలు బాగుంటాయి…
రంగం భవిష్యవాణిని పచ్చికుండ పై నిలబడి స్వర్ణలత అమ్మవారు పూనాక భవిష్యత్తు చెప్పారు. గత ఏడాది ఇచ్చిన హామీలను మరచిపోయారంటూ అమ్మవారు పలికారు. ఈ ఏడాదైనా ఆ హామీలను తీర్చాలని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది వర్షాలు పడుతాయని చెప్పారు.
అయితే అగ్నిప్రమాదలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక తను చూస్తూనే ఉన్నట్లు ప్రతి గడపను కాపాడుతానని అమ్మవారు అభయం ఇచ్చారు. పూజలు అన్నీ చక్కగా నిష్ఠతో చేసారని, తాను ఎవరు ఏమి చేసారో అన్నీ చూస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది లోపు గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పారు. ఇక బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించగా లక్షలాది మంది ఈ ఏడాది బోనాలకు వచ్చారు.
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…