Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక అనంతరం ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమా షూటింగ్ పనులతో ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇకపోతే తాజాగా నటి రష్మిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మనకు ఎవరైనా మూడ్ ఆఫ్ వచ్చిన, మనసు బాగా లేకపోయినా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాము. కానీ రష్మిక ఇందుకు పూర్తిగా భిన్నం అని తెలుస్తుంది.
ఈమె మనసు బాగా లేకపోయినా మూడ్ ఆఫ్ అయితే కనుక వెంటనే కిచెన్ లోకి దూరి ఏదో ఒక రెసిపీ తయారు చేసి అందరికీ వడ్డిస్తారట. ఇలా చేయడంతో తన మనసు తేలిక పడుతుందని రష్మిక ఒక సందర్భంలో తెలియజేశారు. ఇలా నలుగురికి భోజనం పెట్టడం వల్ల తన మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈమె ఓ సందర్భంలో తెలియచేశారు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఈ వార్త వైరల్ కావడంతో మనసు బాగా లేకపోతే వంట చేయడం ఏంటి? అసలు ఇదేం అలవాటు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…