గత నెలరోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అసలు మా ఎన్నికలను చూస్తుంటే సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పవచ్చు.
ఇక ఎలక్షన్స్ రోజు వరకు రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తారాస్థాయిలో గొడవలు చోటు చేసుకున్నప్పటికీ అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు ముగిసి మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల ఫలితాలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ మాట్లాడుతూ ముందుగా మంచు విష్ణుకు అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందగా మంచు ప్యానల్ నుంచి ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా విజయం సాధించారు.
కేవలం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఒక్కడే గెలుపొందడం విశేషం. శ్రీకాంత్ తన విజయం గురించి మాట్లాడుతూ తాను గెలిచిన దాని కన్నా ప్రకాష్ రాజ్ ఓడిపోయినందుకు ఎంతో బాధగా ఉందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.ఎన్నికల కౌంటింగ్ అనంతరం మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకోవడంతో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…