Ravanasura: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్, ప్లాప్ తో సంబంధం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల ధమాకా సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు రావణాసర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8 వ తేది థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పై ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ విడుదల తేది గురించి తాజా వార్త వెలువడింది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లలో విడుదల చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన కొంతకాలానికి ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా విడుదలైన రావణాసుర సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రావణాసుర ఓటీటీ హక్కులను చేజిక్కించుకుంది. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో క్రైమ్ త్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ నటించిన ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా రవితేజకి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి. ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…