Political News

Rayapati Shailaja : మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకునేది లేదు! మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక

Rayapati Shailaja : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కొన్ని మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకుల అండతో నడిచే ఇలాంటి సంస్థలు సమాజానికి చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్య పదజాలం వాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Women’s Commission Chairperson Rayapati Sailaja warns that there will be no peace if women’s self-respect is damaged

“జర్నలిస్టులు బాధ్యత లేకుండా అసత్య కథనాలు ఎలా ప్రసారం చేస్తారు?” అని ఆమె ప్రశ్నించారు. గుంటూరులో 150 ఇన్‌స్టిట్యూట్‌లు ఫీమేల్ సెక్స్ వర్కర్స్‌తో రిజిస్టర్ అయ్యాయని ఒక జర్నలిస్ట్ చెప్పడం అవాస్తవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డేటా ప్రకారం, ప్రతి జిల్లాలో ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, వారితో పనిచేసే ఎన్జీఓలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని ఆమె వివరించారు.

“టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చిందని చెబుతున్నారు. అందులో కూడా ఒక ప్రాంతం పేరు చెప్పకుండా రాష్ట్రం గురించి మాత్రమే రాశారు. కానీ వీళ్ళు రాజకీయ కారణాల కోసం ఒక ప్రాంత మహిళలను అవమానించడం చాలా తప్పు” అని శైలజ అన్నారు. అమరావతి ప్రాంత మహిళలు రాజధాని కోసం భూములిచ్చి త్యాగం చేశారని, అలాంటి వారిని కించపరచడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. మీడియా ప్రజల పక్షాన నిలబడాలని, ప్రభుత్వంలోని మంచి చెడులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రాజకీయ నాయకుల నీడలో నడిచే ఛానళ్లు సమాజానికి ప్రమాదకరమని ఆమె పునరుద్ఘాటించారు. గతంలో రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అన్నందుకు ఒక జర్నలిస్ట్ రైతులపై కేసు పెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామని, డీజీపీకి లేఖ రాశామని శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా లేఖ రాసి, ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరామని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా రాసి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నామని ఆమె అన్నారు. అవసరమైతే అలాంటి ఛానళ్లను మూసివేసే అధికారం కూడా ప్రెస్ కౌన్సిల్‌కు ఉందని ఆమె గుర్తు చేశారు.

మహిళా కమిషన్‌కు నేరుగా అరెస్ట్ చేసే అధికారం లేదని, కానీ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ లేదా డీజీపీకి చెప్పగలమని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో రెండో వ్యక్తికి, సాక్షి మీడియా యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్‌కు సమన్లు జారీ చేస్తున్నామని ఆమె తెలిపారు.

“తప్పు చేస్తే క్షమాపణ కోరవచ్చు కదా? అలా చేయకుండా దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ఆమె స్పష్టం చేశారు.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

17 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

18 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago