General News

బ్యాంకులకు క్యూ కడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే కరోన మహమ్మారిని కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితుల కోసం ఆస్పత్రిలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి.

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రజలు బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రజలు బ్యాంకు నుంచి అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9 ఈ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న డబ్బులు దాదాపు రూ.52,928 కోట్లు పెరిగాయి.ప్రజలు ఈ విధంగా బ్యాంకులో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి గల కారణం లాక్ డౌన్ ప్రకటించవచ్చు అని సందేహాలు రావడమే. లాక్ డాన్ ప్రకటిస్తే అత్యవసర పరిస్థితులలో డబ్బులు అవసరం ఏర్పడుతుందేమోనని ముందుగానే ప్రజలు బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది ఈ విధమైనటువంటి కరోనా పరిస్థితులలో కూడా ప్రజలు అధిక మొత్తంలో బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది.2020 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ.22.55 లక్షల కోట్ల నుంచి రూ.25.62 లక్షల కోట్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

3 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

13 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

24 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

34 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

54 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago