వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన లడ్డూ వేలంపాట మరోసారి రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డూ వేలంలో గత రికార్డులు బద్దలయ్యాయి.
గత ఏడాది ఈ కమ్యూనిటీలో గణేశ్ లడ్డూ రూ. 1.87 కోట్లు పలికింది. అయితే ఈసారి ఆ ధరను మించి ఏకంగా రూ. 2 కోట్లు 31 లక్షల 74 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ రికార్డు ధర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లడ్డూను సొంతం చేసుకుంటే ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే వేలంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, లడ్డూ కోసం తీవ్రంగా పోటీపడ్డారు.
వినాయక లడ్డూ వేలంపాటలు సాధారణంగా ప్రతి ఏటా రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే, కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నమోదైన ఈ ధర దేశవ్యాప్తంగా ఉన్న వేలంపాటల్లో అత్యధికమైన వాటిలో ఒకటిగా నిలిచింది. డప్పుల మోతలు, భజనలు, నృత్యాల మధ్య జరిగిన ఈ వేలంపాట, ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిసింది.
ఈ లడ్డూను దక్కించుకున్న భక్తులు తాము అదృష్టవంతులమని భావిస్తున్నారు. ఈ ఏడాది ఈ రికార్డును మించిన వేలం మరెక్కడైనా జరుగుతుందేమో చూడాలి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…