Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ విధంగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను ఇండస్ట్రీకి దూరం కాబోతున్నానని తెలుపుతూ అందరికి షాక్ ఇచ్చారు.
ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రోడ్డు ప్రమాదం తర్వాత అవసరమైనటువంటి సర్జరీలు చేసిన అనంతరం ఈయనకు ప్రస్తుతం ఒక సర్జరీ చేయాల్సి ఉందట అందుకోసమే ఆరు నెలలపాటు ఇండస్ట్రీకి దూరం అవ్వబోతున్నారని, ఈ ఆరు నెలలు పూర్తిగా కోలుకొని అనంతరం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియజేశారు.
ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ కోసమే ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారన్న విషయం తెలియడంతో ఈయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…