గత కొద్ది రోజులుగా ఇంటి ప్రాంగణానికే పరిమితం అయి షూటింగ్ లకు దూరంగా ఉంటూ, ఫిట్ నెస్ పై పూర్తి దృష్టిసారించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కుదుటపడింది. ఆయన ఆస్పత్రి నుంచి ఎప్పుడో డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంకా కొంత కాలం షూటింగ్ లకు దూరంగా ఉండడమే మేలు అని వైద్యులు చెప్పిన సలహా మేరకు ఆయన ఇంటికే పరిమితం అయి ఉన్నారు.
ఇప్పుడు తన గాయాలన్నింటి నుంచి పూర్తి స్థాయిలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఇక అతడు హైద్రాబాద్ లో రోప్ వే బ్రిడ్జీ సమీపాన ప్రమాద వశాత్తూ బైక్ స్కిడ్ అయి గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనను సమీప ఆస్పత్రికి 108 లో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలోకు చేర్చి, వైద్యం అందించారు. తరువాత ఆయన క్రమంగా కోలుకున్నాడు. ఆసుపత్రిని డిశ్చార్జి అయిన తర్వాత అతడు ప్రేక్షకులకు ఒక్కసారి మాత్రమే కనిపించాడు.
అది కూడా దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులోనే అతడు కనిపించాడు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతడు కోమాలోనే ఉన్నాడు. సినిమా విడుదల సందర్భంలో కూడా అతడు కోలుకోలేదు. అయితో రిపబ్లిక్ సినిమా ఓటీటీలో విడుదలకు ముందు మాత్రం అతడు అభిమానులతో ముచ్చటించాడు. ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఇక ప్రస్తుతం అతడు బాగా సన్నపడ్డాడని సమాచారం.
దాని కోసం ఫిట్ నెస్ ను పెంచుకునే పనిలో పడ్డాడు సాయిధరమ్ తేజ్. ఇక అతడి తదుపరి చిత్రాలపై ఎక్కువగా శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. అతడికి యాక్సిడెంట్ కాకముందు చేతిలో సినిమాలు ఉండేవి… తర్వాత అవి అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా అతడికి కార్తిక్ అనే వ్యక్తి కథను వినిపించాడని.. అది ఓకె అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. దాంతో పాటు.. తన బావ వరుణ్ తేజ్ తో కలిసి సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ రెండు సినిమాలతోనే సాయి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ మళ్లీ మునిపటిలా మారడానికి మాత్రం 2022 ఫిబ్రవరి వరకు పట్టే అవకాశం ఉంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…