సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడం ఈ మధ్య చాలనే చూస్తున్నాం… గతంలో ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలన్నా సంప్రదాయం నుంచి ప్రస్తుతం కాస్త వెరైటీగా హీరోలు, హీరోయిన్లు తమ గొంతును సవరించుకుంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో వెంకీ, చిరంజీవి, పవన్ కళ్యాన్, రవితేజ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో పాటలు కూడా పాడారు. మరో వైపు రాశీ ఖన్నా, శృతి హాసన్ వంటివారు కూడా పాటలు పాడారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ పాట పాడారు.
కరీంనగర్ లో జరిగిన ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఆయన నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పాటను పాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనలోని సింగింగ్ టాలెంట్ను బయటకి తీశారు. మొదట మొహమాటంగా పాడినట్లు కనిపించినా.. తరువాత పాటలో లీనమై పాటను పాడారు.
గతంలో కూడా దిల్ రాజు సినిమాలో పాటపాడారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ను దిల్ రాజు నిర్మించారు. ఆ సినిమాలో ‘అన్నయ్యెచ్చినాడు’ అంటూ మొదటి సారిగా పాటను పాడారు. ఆస్పూర్తితోనే మళ్లీ తనలోని గాయకుడిని బయకు తీశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు పాడిన పాట వీడియో వైరల్ అయింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…