సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడం ఈ మధ్య చాలనే చూస్తున్నాం… గతంలో ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలన్నా సంప్రదాయం నుంచి ప్రస్తుతం కాస్త వెరైటీగా హీరోలు, హీరోయిన్లు తమ గొంతును సవరించుకుంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో వెంకీ, చిరంజీవి, పవన్ కళ్యాన్, రవితేజ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో పాటలు కూడా పాడారు. మరో వైపు రాశీ ఖన్నా, శృతి హాసన్ వంటివారు కూడా పాటలు పాడారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ పాట పాడారు.
కరీంనగర్ లో జరిగిన ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఆయన నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పాటను పాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనలోని సింగింగ్ టాలెంట్ను బయటకి తీశారు. మొదట మొహమాటంగా పాడినట్లు కనిపించినా.. తరువాత పాటలో లీనమై పాటను పాడారు.
గతంలో కూడా దిల్ రాజు సినిమాలో పాటపాడారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ను దిల్ రాజు నిర్మించారు. ఆ సినిమాలో ‘అన్నయ్యెచ్చినాడు’ అంటూ మొదటి సారిగా పాటను పాడారు. ఆస్పూర్తితోనే మళ్లీ తనలోని గాయకుడిని బయకు తీశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు పాడిన పాట వీడియో వైరల్ అయింది.
































