Samantha: శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో తన అనారోగ్యం గురించి చెబుతూ సింపతీ క్రియేట్ చేయటానికి సమంత ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సినిమా కోసం సింపతీ కార్డు వాడిందంటు గత కొన్ని రోజులుగా సమంతని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నిర్మాత చిట్టి బాబు సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం సినిమాని హిట్ చేయటం కోసం మాత్రమే సమంత ఇలా డ్రామాలు చేస్తోందని అన్నాడు.
మొదట చిట్టి బాబు చేసిన వ్యాఖ్యలకు ఖండించినవారు ప్రస్తుతం సమంతా చేసిన పని వల్ల చిట్టి బాబు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. కొంతకాలం క్రితం సమంత మయోసైటీసిస్ వ్యాధి బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సమంత కీలక పాత్రలో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ సింపతీ క్రియేట్ చేసి హిట్ కొట్టింది.
ఇక శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో కూడా సింపతి కార్డు వాడి సినిమాని సక్సెస్ చేయాలని ప్రయత్నించింది. అయితే సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించలేదు. అయితే నిన్న మొన్నటి వరకు అనారోగ్యం అని చెప్పిన సమంత దేశం దాటి వెళ్ళగానే రూపం మార్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో ఆమె విదేశాలకు వెళ్లారు. దేశం దాటి కట్టు బొట్టు మార్చేసింది.
ఇక్కడ తెల్ల చీర కట్టుకొని జప మాల ధరించిన సమంత అక్కడికి వెళ్ళగానే అల్ట్రా స్టైలిష్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సమంత అనారోగ్యం అంతా కట్టు కథ అని, ఆమె చెప్పే మాటల్లో నిజం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విమర్శలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్లైన్ మోసం వెలుగులోకి…