Sandhya Janak : తల్లి పాత్రలతో మెప్పిస్తున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో ఒకరు సంధ్య జనక్ ఒకరు. తెలుగు ప్రాంతానికి చెందిన వారే అయినా తండ్రి ఉద్యోగ రీత్యా నార్త్ లో ఉండటం వల్ల అక్కడే చదువుకున్నారు. ఇక సినిమాల్లోకి రాకమందు జర్నలిస్ట్ గా పని చేసిన సంధ్య సినిమాల్లో తమన్నా తల్లి పాత్రలో ‘హ్యాపీ డేస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడేళ్ల సినిమా ప్రస్థానంలో ఎన్నో సినిమాలను చేసిన ఆమె తన కెరీర్ గురించిన విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అల్లరి నరేష్ సినిమాకు డబ్బు ఇవ్వలేదు… ఇంకా నయం మార్ఫింగ్ చేయలేదు…
యముడికి మొగుడు సినిమాలో సంధ్య జనక్ గారు నటించారు. అయితే ఆ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసినా పేమెంట్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కంప్లెయింట్ చేసి పోరాడితే చెప్పిన దాంట్లో సగం పేమెంట్ ఇచ్చారు. బళ్లకు నష్టాలు వచ్చాయి అది అంటూ కారణాలు చెప్పడం తో వదిలేసాను. అలా పేమెంట్ సరిగా ఇవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ చెప్పారు. ఇక వెన్నెల కిషోర్ నటించిన ‘అతడు ఆమె ఓ స్కూటర్’ సినిమాలో వెన్నెల కిషోర్ కి తల్లి పాత్రలో నటించాను.
అయితే సినిమా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళు వెన్నెల కిషోర్, సంధ్య జనక్ సెక్సీ సీన్స్ అంటూ వీడియో కింద పెట్టారు ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం ఉండదు. హీరో హీరోయిన్స్ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయి అవి కూడా అభ్యంతరకరంగా ఏం లేవు కానీ పేరు నాదెందుకు పెట్టారో తెలియదు అంటూ చెప్పారు. ఇంకా నయం నా మొహాన్ని మార్ఫింగ్ చేసి పెట్టలేదు సంతోషం. ఇలా చేసినా వీడియో ఓపెన్ చేసి చూస్తే లోపల ఏముందో తెలుసుకుంటారు కదా అక్కడ ఉన్నది నేనా వేరేవాళ్ళ అని దానివల్ల ఇబ్బంది ఉండదు అంటూ తన అనుభవాలను పంచుకున్నారు సంధ్య జనక్.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…