Suddhala Ashok Tej : పాటల రచయితగా ఎన్నో పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలంగాణ విప్లవ గీతాలతో మొదలు సినిమా రొమాంటిక్ సాంగ్స్ వరకూ అన్నింటినీ రాయగల నేర్పరి ఆయన. ఇక ఆయన రాసిన ‘ఠాగూర్’ చిత్రంలోని ‘నేను సైతం ప్రపంచానికి’ పాటకు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. సుద్దాల గారు మొదట ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ కవిగా రచనలను సాగించేవారు. నటుడు ఉత్తేజ్ గారు ఆయనకు మేనల్లుడు అవడం అప్పటికే సినిమాల్లో ఉన్న ఉత్తేజ్ గారి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే మొదట్లో సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి, ఆయన పడిన ఇబ్బందులను గురించి సుద్దాల వివరించారు.
శ్రమ దోపిడీ అన్నిచోట్లా ఉంది…
మొదట్లో అవకాశాలు రావడమే ఎక్కువ అన్న పరిస్థితిలో చాలా మంది సినిమాలకు రాయించుకుని కేవలం భోజనం పెట్టి ఊరు వెళ్ళడానికి దారి ఖర్చులు ఇస్తామని చెప్పేవారట. మరికొంతంది డబ్బు ఇస్తాము కానీ సినిమాలో నీ పేరు బదులు వేరేవారి పేరు వేస్తాం అని చెప్పేవారట. అలా వద్దు నా పేరే వేయండి కావాలంటే డబ్బు ఇవ్వద్దు అని చెప్పేవారట సుద్దాల గారు.
అలా కొన్నేళ్లు డబ్బు సరిగా ఇవ్వకపోవడం లేదా మీకు పనికి తిండి పెట్టడం ఎక్కువ అన్నట్లుగా మాట్లాడేవారు అంటూ చెప్పారు. కానీ నేను కోల్పోయిన దాని కంటే సక్సెస్ అయ్యాక ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాను అంటూ చెప్పారు. శ్రమ దోపిడీ అన్నిచోట్లా ఉందని, డైరెక్టర్ నిర్మాత ఒక ఆర్టిస్ట్ అందరూ శ్రమ దోపిడీ కి గురవుతున్నారు, ఏదో ఒక సందర్భంలో అవుతుంటారు అంటూ చెప్పారు.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…