YSRCP:సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అనుబంధం ఉంది సినిమాలలో కొనసాగిన వారందరూ కూడా రాజకీయాలలోకి వచ్చే ఎంతో మంచి పదవులలో కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే స్థాపించడం విశేషం.
ఈ రెండు పార్టీలతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో సినీ గ్లామర్ కాస్త తక్కువగా ఉందని చెప్పాలి మొదట్లో జగన్ తరుపున మద్దతు తెలపడానికి సినీ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపించలేదు అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జగన్ పార్టీకి అలీ, పోసాని, జయసుధ, రాజశేఖర్ దంపతులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, వంటి వారు జగన్ పార్టీకి మద్దతు తెలిపారు.
ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగిన మంత్రి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఇకపోతే జగన్ పార్టీలోఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సినీనటి రోజాకు సైతం మంత్రి పదవి ఇచ్చి తనకు ప్రాధాన్యత కల్పించారు. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ కు ఎస్ వి బి సి చైర్ పర్సన్ గా నియమించినప్పటికీ ఆయన తన పదవిని ఎక్కువ కాలం పాటు నిలబెట్టుకోలేక పోయారు.
ఇకపోతే ఇండస్ట్రీలో తన గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ పోసాని కృష్ణమురళి అలీ మాత్రం జగన్ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం కూడా ఈ ఇద్దరు నటులకు ఏమాత్రం అన్యాయం చేయకుండా మంచి పదవులను కట్టబెట్టారు. పోసాని కృష్ణమురళి కి ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ గా బాధ్యతలు ఇవ్వగా, అలికి ఏపీ ఎలక్ట్రానిక్ విభాగానికి సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలా తనని నమ్ముకున్న సినీ సెలబ్రిటీలకు జగన్ ఏదో ఒక పదవిలో కూర్చోబెడుతున్నారు అయితే వీరందరికీ మంచి పదవులు ఇవ్వగా తర్వాత జగన్ ప్రభుత్వంలో చోటు సంపాదించుకునే నటుడు కృష్ణుడు అని తెలుస్తోంది. వినాయకుడు సినిమా ద్వారా అందరికీ పరిచయమైన నటుడు కృష్ణుడు కూడా వైసిపి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంలో తర్వాత స్థానం ఈయనకే ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…