ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మనకు తేలికపాటి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ కోసం ఆస్పత్రిలో వెంట, లేబరేటరీలో వెంట పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే శాంపుల్ ఇచ్చినా రెండు మూడు రోజుల తర్వాత గాని ఫలితాలు విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే వ్యాధి తీవ్రత మరింత అధికమవుతుంది. ఇకపై ఈ విధమైనటువంటి కష్టాలు ఉండవని, ఇంట్లోనే ఉంటూ మీరే సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవచ్చని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ భారతదేశంలోనే మొదటి కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ‘కోవీసెల్ఫ్’ ఆవిష్కరించారు.
మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఆవిష్కరించిన ఈ ‘కోవీసెల్ఫ్’ టెస్టింగ్ కిట్స్ ప్రస్తుతం మార్కెట్లో అమ్మకాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి కిట్స్ మీ దగ్గరలోని ఫార్మసీలలో లేదా ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ విధమైనటువంటి ‘కోవీసెల్ఫ్’ కిట్స్ కేవలం రూ.250 మాత్రమే. భారతదేశంలోని 95% పిన్ కోడ్స్కి వీటిని డెలివరీ చేస్తామని మైల్యాబ్ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ కిట్స్ డెలివరీ ఉంటుందని మై ల్యాబ్ ప్రకటించింది.
ఈ విధంగా మై ల్యాబ్ ఆవిష్కరించిన ‘కోవీసెల్ఫ్’ కిట్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఆమోదం పొందిన తర్వాత గత నెలలో కోవిడ్ 19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ‘కోవీసెల్ఫ్’ను పరిచయం చేసింది. వీటి ద్వారా ఎవరూ కూడా వ్యాధి నిర్ధారణ కోసం ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెట్టాల్సిన పనిలేదు.ఇంట్లోనే ఉంటూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని తగిన జాగ్రత్తలను పాటించడం ఎంతో వీలవుతుంది.
ఈ క్రమంలోనే ఈ ‘కోవీసెల్ఫ్’ కిట్స్ ద్వారా ఏ విధంగా పరీక్ష చేసుకోవాలో తెలియని వారికి పరీక్ష ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో రూపంలో పొందుపరిచారు. దీని ఆధారంగా కరోనా నిర్ధారణ పరీక్ష ఎంతో సులభంగా చేసుకోవచ్చని మైల్యాబ్ డైరెక్టర్ సుజీత్ జైన్ తెలిపారు. ఒకవేళ ఈ పరీక్ష ద్వారా పాజిటివ్ వచ్చిన వారు మరొకసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని సుజీత్ జైన్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…