Senior Journalist Bhardwaja : సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి గారు 78 ఏళ్ల వయసులో శనివారం నాడు అనారోగ్య సమస్యలతో ఆయన చెన్నై లోని ఆయన స్వగృహం లో తుదిశ్వాస విడిచారు. ‘సీతామహాలక్ష్మి’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మురారి గారు తన ముక్కుసూటి తనం వల్ల ఇండస్ట్రీలో చాలా మందితో వైరం, వివాదాలు పెట్టుకున్నారు. సీతామహాలక్ష్మి, గోరింటాకు, జే గంటలు, త్రిశూలం, నారీ నారీ నడుమ మురారీ, జానకి రామూడు, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలను నిర్మించారు. సినిమా తీయడంలో నిర్మాత కు గౌరవం తగ్గిపోతోంది అని ఆయన సినిమా నిర్మాణానికి దూరంga ఉండిపోయారు. అయితే ఆయన ఆత్మ కథ ‘నవ్విపోదురుగాక’ అనే పేరు తో ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిపై విమర్శలు చేసారు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు, చిరంజీవిలను విమర్శించారు. ఇక ఆయన శైలి, ఆయన ప్రస్థానం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అనుభవాలను పంచుకున్నారు.
ఆ డైరెక్టర్ మీద కోపంతో కుక్కలను వదిలిన కాట్రగడ్డ మురారి…
కాట్రగడ్డ మురారి గారి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ముందు నుండి అనుబంధం ఉండేది. ఆయన పెద్ద నాన్న కాట్రగడ్డ మధుసూదన రావు గారు సినిమాల్లో ఉన్నారు. నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పంపినీ లో కుటుంబం ఉంది. ఇక కాట్రగాడ్డ మురారి గారికి చిన్నపుడు చదువు చెప్పిన వీరమాచినేని మధుసూదనరావు గారు క్లాస్ లో ఎవరైనా సరిగా చదవకపోతే కొట్టేవారట అలా ఒకసారి మురారి గారిని కొట్టారట దీంతో కోపం పెంచుకున్న మురారి గారు ఆయన వారి వీధిలో వెళుతుంటే కుక్కలను ఉసిగొల్పి ఆయన మీదకు వదిలాడట. ఇక మెడిసిన్ చదువుతున్న మురారి గారు సినిమాల మీద ఇష్టంతో డైరెక్టర్ అవుతానని ఇంట్లో అడిగి చెన్నై వెళ్ళాడట. అక్కడ చిన్నపుడు టీచర్ అయిన వి మధుసూదన్ రావు గారు అప్పటికే డైరెక్టర్ అయ్యారు ఆయన వద్ద శిష్యరికం చేశారు.
ఇక ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్నపుడు అక్కడే అసిస్టెంట్స్ గా ఉన్న రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు ఇద్దరూ స్నేహితులు అయ్యారు. ఇక డైరెక్టర్ గా కాకుండా నిర్మాత వారితో సినిమాలను చేసిన కాట్రగడ్డ తన ఆత్మకథ పుస్తకం లో మాత్రం రాఘవేంద్రరావు ను బాగా విమర్శించారు. పాటలు తీయాలంటే బత్తాయి పళ్ళు లారీ కావాలా అంటూ కామెంట్స్ చేశారు. ఇక మీరు చిరంజీవి తో ఎందుకు సినిమా చేయలేదని అడిగితే కాట్రగడ్డ గారు ఆయనతో సినిమా చేయనందుకే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెప్పారట. ఆ మాటకు చిరంజీవి గారు కూడా ఆయనతో సినిమా చేయనందుకు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని కౌంటర్ ఇచ్చారట. ఇలా కాట్రగడ్డ మురారి గారు ఆయన కు నచ్చింది మాట్లాడేవారు దీనివల్ల ఎంతో మంది వ్యతిరేకులను తయారుచేసుకున్నారు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…
చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…