Shiva Jyothi:తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శివజ్యోతి. ఇలా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలా తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అలాగే జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన శివ జ్యోతి ఆ ఖరీదైన ఇంటికి అనుగుణంగా ఓ మంచి కారు ఉండాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా ఈమె ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు. సాధారణంగా దసరా వంటి ముఖ్యమైన పండుగల రోజు ఖరీదైన కార్లను ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇలాంటి ప్రత్యేక రోజులలో కొత్త కార్లను కొనుగోలు చేయడానికి సెలబ్రెటీలు ముందు వరుసలో ఉంటారు.
ఇప్పటికే బిత్తిరి సత్తి షణ్ముఖ్ జస్వంత్ వంటి వారు కొత్త కార్లను కొనగా తాజాగా శివ జ్యోతి కూడా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు.అయితే ఈమె తన కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇది మూడవ కారు కావడం విశేషం. ఇప్పటికే రెండు కార్లను కొనుగోలు చేసిన శివ జ్యోతి తాజాగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారణం కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…