Shivani Rajasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జీవిత రాజశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే వీరి కుమార్తెలు ఇద్దరు శివాని శివాత్మిక హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు. శివాని కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
ఈ సినిమా ద్వారా ఈమె మొదటి హిట్ అందుకున్నారని చెప్పాలి. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నష్టజాతుకురాలని మా ఇంటికి నేను దరిద్రం అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. శివాని రాజశేఖర్ మాట్లాడుతూ శేఖర్ సినిమా సమయంలో తనకు కరోనా వచ్చింది. అయితే ఈ సినిమాలో తన తండ్రి కూడా నటించడంతో ఆయనకి కూడా కరోనా వచ్చింది.
నేను కరోనా బారిన పడడంతో నావల్లే నాన్నకు కూడా కరోనా వచ్చింది. కానీ నాన్నకు చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ పై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని,శాచురేషన్ పూర్తిగా పడిపోయిందనీ తెలిపారు. ఇలా నాన్నని బెడ్ పై చూసి తనకు చాలా బాధేసిందని నాన్న ఈ పొజిషన్ కి రావడానికి తానే కారణం అంటూ ఎంతో ఏడ్చానని తెలిపారు.
నాన్నే నాకు ధైర్యం చెప్పారు…
నావల్ల నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తూ బహుశా నేను మా ఇంటికి దరిద్రురాలినేమో నా జాతకం బాగా లేకపోవడం వల్లే ఇలా నాన్నకు ఇలా జరిగిందేమో అంటూ ఎన్నో ఆలోచనలు చేసేదానిని అంటూ ఈమె తెలియజేశారు. ఇక నాన్న వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ తమకు ఎంతో ధైర్యం చెప్పేవారని శివాని వెల్లడించారు. తాను గుండె దడ సమస్యతో బాధపడుతున్నాను అది నెలకు ఒకసారి మాత్రమే నాకు వచ్చేది. నాన్నే అందుకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కానీ నాన్నకు అలా అయ్యేసరికి రోజుకు రెండు మూడు సార్లు అలాంటి సమస్యతో బాధపడ్డానని తనకు ఏమవుతుందోనని నాన్న నాకు చాలా ధైర్యం చెప్పారు అంటూ ఈ సందర్భంగా శివాని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…